WNP: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన 40 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు.