BDK: భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా తాజాగా శనివారం మరో ఇద్దరు సతీష్, తేజ మృతదేహాలు లభ్య మవడంతో గాలింపు చర్యలు పూర్తయ్యాయి. నిన్నటి గాలింపులో ముగ్గురి మృతదేహాలు దొరకగా, మిగిలిన ఇద్దరి కోసం నేడు గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహాలు బయటపడ్డాయి.