MNCL: మందమర్రి పట్టణంలోని CER క్లబ్ వెనుక గల ఈద్గా వద్ద శనివారం రంజాన్ ప్రార్థనలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని కొనియాడారు. ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.