MNCL: భీమిని మండలం పెద్దపేట గ్రామ పంచాయతీకి చెందిన పర్థన్ రామకృష్ణ అధికంగా నాటు సరకు (మద్యం) తాగడం వల్ల కాలేయం దెబ్బతిని మృతి చెందాడు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడిని తండ్రి అశోక్ మంగళవారం రాత్రి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రాణాలు విడిచాడు. చేతికి ఎదిగిన కొడుకు కళ్లముందే మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.