PDPL: మంథని మండలం గుంజపడుగులో ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ సంధ్య ఆధ్వర్యంలో వ్యాపారులతో కలిసి తీర్మానించారు. చికెన్, మటన్, చేపలు, కిరాణా షాపుల నుంచి వచ్చే వ్యర్థాలను ప్రతిరోజూ తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తబండిలో వేయాలని, ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.