SRPT: నేరేడుచర్ల మండలం పెంచికల్ గ్రామంలోని ఊర చెరువు నీటిని చాపల వేట పేరుతో వృధా చేయవద్దని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ చెరువు కింద సుమారు 70 ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా, ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉందని రైతులు తెలిపారు. కీలక సమయంలో చేపల వేట కోసం తూము ద్వారా నీటిని వదిలేస్తుండటంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.