మంచిర్యాల జిల్లా భీమారం మండలం కాజిపల్లి గ్రామ సర్పంచ్ కొండ శ్యామల శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వివేక్ వెంకట స్వామి ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మి, మాజీ సర్పంచ్ కొండా చంద్రశేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.