MNCL: జన్నారం మండల తహసీల్దార్ కార్యాలయంలో గత ఏడాది కాలంగా భూ సర్వేలు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, ఏదో ఒక సాకుతో అధికారులు పనులను వాయిదా వేస్తుండటంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల ఇబ్బందులను తొలగిస్తారో లేదో వేచి చూడాలి.