TPT: పాకాల మండలం ముద్దలపల్లి పొలాల్లో తలారిపల్లెకు చెందిన ముత్తిరేవుల సుబ్రహ్మణ్యం (45) మృతదేహం లభ్యమైంది. తలపై బలమైన గాయం ఉండటంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఫోన్ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.