మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో వివిధ రాజకీయ పార్టీల నుంచి బీసీ అభ్యర్థులు భారీ ఎత్తున గెలిచారని బీసీ మేధావుల సంఘం తెలిపింది. కార్పొరేషన్లో ఆయా రాజకీయ పార్టీలు తమ పార్టీలోని బీసీ కార్పొరేటర్లకు మున్సిపల్ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, నాయకులు లింగం మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.