SKLM: లావేరు మండలం గుర్రాలపాలెం పంచాయతీ పరిధిలోని రోడ్డు అధ్వానంగా తయారైంది. గుర్రాలపాలెం నుంచి బాణం, జి.సిగడాం, పొందూరు మండలాలకు వెళ్లే రోడ్డులో గత ఏడాది కిందట మెటల్ రాళ్లు వేసి వదిలేశారు. రోడ్డుపై రాళ్లు తేలి ఉండడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తారు రోడ్డు వేయాలని ప్రజలు కోరుతున్నారు.