బాపట్లలో కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో 20 టాయిలెట్స్, యూరినల్స్, నీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతతో పూర్తయ్యేలా చూడాలని, వారంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.