KMR:ఆర్టీసీ సిబ్బంది మరోసారి తమ నిజాయితీని చాటుకున్నారు.ఆదివారం NZB రెండో డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణించిన ఓ మహిళ తన స్మార్ట్ ఫోన్ను సీట్లోనే మర్చిపోయింది. బస్సు కామారెడ్డి చేరుకున్నాక ఫోన్ను గమనించిన కండక్టర్ నమ్రత, వెంటనే బస్టాండ్ పాయింట్ కంట్రోలర్ సమక్షంలో సదరు ప్రయాణికురాలికి దానిని అందజేశారు.