BHNG: కన్నతల్లిలా చూసుకోవాల్సిన కోడళ్లు తనను అనాథను చేశారని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వయసు మళ్ళిన కాలంలో అండగా ఉండాల్సిన వారే గడప దాటించడంతో, 81 ఏళ్ల వృద్ధురాలు న్యాయం కోసం జిల్లా కలెక్టర్ను ఆశ్రయించింది. సోమవారం భువనగిరి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆమె జిల్లా కలెక్టర్ హనుమంతరావును కలిసి గోడు వెల్లబోసుకుంది.