PLD: నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు, దివంగత కడియం కోటి సుబ్బారావు విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు.