ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో నకిలీ పట్టాలు, అక్రమ కేటాయింపులపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు 19 కేసులు నమోదు కాగా, 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 250 కోట్ల విలువైన 31 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.