AP: నిద్రిస్తున్న విద్యార్థులపై తోటి విద్యార్థి కత్తి, రాడ్లతో దాడి చేశాడు. ఈ దాడిలో కర్నూలుకు చెందిన హేమంత్ కుమార్ అనే విద్యార్థి మృతిచెందాడు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అడ్డుకున్న మహిళా వార్డెన్, సెక్యూరిటీపైనా దాడి చేసి విద్యార్థి పరారయ్యాడు. డ్రగ్స్కు బానిసలై ఇలా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన కర్ణాటకలోని బళ్లారిలో జరిగింది.