MDK: తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు నీటి వినియోగం, పంటల మార్పిడి పై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి గంగమల్లు, ఉద్యాన శాఖ అధికారి రచన ఆధ్వర్యంలో పంటలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. నేలలో సేంద్రియ కార్బన్ ప్రాముఖ్యత ఎలా పెంచుకోవాలో వివరించారు.