WGL: నల్లబెల్లి మండలంలోని కొండయిపల్లి GPలో నిర్వహిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పనులను జడ్పీ సీఈవో రాం రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన HIT TVతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులకు వచ్చే కార్మికులకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.