MBNR: ప్రజారోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత లభిస్తుందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జానంపేట పీహెచ్సిలో ప్రముఖ వైద్యులచే నిర్వహించిన వైద్యశిబిరాన్న ఇవాళ ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అన్నివర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.