KMM: వైరాలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, పనుల వేగంపై అసహనం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.