GDWL: ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ముగిసిన వెంటనే జవాబు పత్రాలను నిబంధనల ప్రకారం సురక్షితంగా తపాలా కార్యాలయానికి చేరవేయాలని అధికారులకు సూచించారు.