నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దులోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల, సుంకేసుల నుంచి సోమవారం రాత్రి నాటికి మొత్తం 8,508 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 835.4 అడుగుల వద్ద 55.5655 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1,308 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశామని అధికారులు తెలిపారు.