NLG: దేవరకొండ ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈనెల 26న వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. వేలంలో పాల్గొనేవారు అదేరోజు ఉదయం 10 గంటల లోపు రూ.10 వేలు డిపాజిట్ చేసి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. వేలంలో వాహనాలు కొనని వారికి డిపాజిట్ తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.