VSP: విశాఖకు చెందిన భవేష్ జైన్ జూలై 2,3 తేదీల్లో తైపీలో జరిగే తైవాన్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఫోరం-2025కి భారత్ నుంచి యువ ప్రతినిధిగా హాజరుకానున్నారు. సముద్ర భద్రతపై చర్చించేందుకు ప్రపంచ వ్యాప్తంగా నిపుణులను తైవాన్ ప్రభుత్వం ఆహ్వానించింది. భవేష్ జైన్ 6వ సెషన్లో ప్రసంగిస్తారు. యంగ్ ఇండియా ఛాలెంజ్, రాష్ట్ర ఉత్తమ N.S.S. వాలంటీర్గా ఈయన అవార్డులు అందుకున్నారు.