JGL: గొల్లపల్లి మండలం బీబీరాజ్ పల్లి మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య (55) తన మామిడి తోటలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో రూ.10 లక్షల నిధులు వెచ్చించి సిమెంట్ రోడ్ల నిర్మాణం చేశాడని, ఆ బిల్లులు ఇప్పటికి రాలేవని, అలాగే తన కుమారుడు విదేశాలకు వెళ్లడానికి రూ.15 లక్షలు వెచ్చించాడని, అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.