కోనసీమ: మండపేట పట్టణం బురుగుంట చెరువు పార్కు వద్ద ఉన్న వాటర్ ట్యాంక్ మరమ్మతుల పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి మంగళవారం పరిశీలించారు. అమలాపురం ఈఈ ఎమ్.టి హుస్సేన్ ఈ పరిశీలనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పనుల్లో జాప్యం జరగకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.