AKP: నాతవరం మండలం శృంగవరంకు చెందిన నీలి నాగేశ్వరరావు 2024 నవంబర్ 26న అడవి పంది దాడిలో మృతి చెందాడు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు నాగేశ్వరరావు కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాగేశ్వరరావు కుమారులకు ఈ నష్టపరిహారాన్ని అందజేశారు.