JGL: పెగడపల్లి రైతు వేదికలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు మంగళవారం పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధికారులు పాల్గొన్నారు.