సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలోని పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ చేసిన దుండగులు ఆపై హత్య చేశారు. మృతురాలు ధర్మారెడ్డిపల్లికి చెందిన సత్తెమ్మ (65)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.