KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠానికి రికార్డు స్థాయిలో రూ.5.13 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. మే చివరి నుంచి జూన్ 22 వరకు 35 రోజుల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారని మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇంత భారీ ఆదాయం రావడం ఇదే మొదటిసారి అన్నారు. చిల్లర లెక్కింపు కొనసాగుతుందని, పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని చెప్పారు.