NDL: తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహాయ సహకారాలు అందజేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో DRO సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు సూచించిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదిస్తామన్నారు.