VSP: ఎండాడ చెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎండాడ చెరువును సందర్శించిన ఆయన పరిసర ప్రాంతాల వారికి ఆహ్లాదం కలిగించేలా సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. చెరువులో నిరంతరం నీరు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.