MNCL: కవ్వాల్ గ్రామంలో చుట్టు పక్క ఉన్న చెరువులు, కుంటలలో నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. అసైన్డ్ చెరువు శిఖం భూములను అడ్డు అదుపు లేకుండా కబ్జా చేశారు. చెరువులపై పడటంతో దీని విస్తీర్ణం క్రమక్రమంగా హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. చెరువు భూముల్లో ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని శుక్రవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.