NLG: నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం సహకారంతో చిట్యాల మండలం ఉరుమడ్ల అయ్యప్ప స్వామి గుట్టకు బుధవారం విద్యుత్ సౌకర్యం చేకూరింది. అధికారులతో మాట్లాడి దేవస్థానానికి సరిపడా స్తంభాలు, లైట్లను ఆయన మంజూరు చేయించారు. ఈ సందర్భంగా భక్తులు, పూజారి కృష్ణమోహనాచార్యులు, పల్లపు బుద్ధుడు వీరేశంకు కృతజ్ఞతలు తెలిపారు.