SRD: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25వ తేదీన కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగులకు 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.