SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో మెమోరాండం అందజేశారు. ఆరు గ్యారంటీలు, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.