MBNR: చిన్న చింతకుంట మండలం పల్లమర్రిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా సమైఖ్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, మహిళల ఆర్థికాభివృద్ధి కుటుంబ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.