MBNR: జిల్లాలో నూతన కలెక్టర్గా కుష్బూ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మేయర్ మమత కలెక్టర్ కార్యాలయంలో కుష్బూ గుప్తాని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.