MHBD: జిల్లాలో ఇవాళ జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్ష(ఫస్ట్ లాంగ్వేజ్) ప్రశాంతంగా జరిగింది. మొత్తం 8,151 మంది విద్యార్థులకు 8,144 మంది హాజరు కాగా,7 మంది గైర్హాజరైనట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. దీంతో 99.91 శాతం హాజరు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.