గద్వాల జిల్లా సమీపంలో వెలిసిన జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా వైభవంగా విశేష అలంకరణ చేశారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, నూతన వస్త్రాలు, వివిధ రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. శ్రీరామనవమి పండుగ వాతావరణంలో జమ్మిచేడు ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో మార్మోగుతోంది.