SRCL: చందుర్తి మండలం లింగంపేట శ్రీసీతారామాంజనేయ స్వామి ఆలయ కమిటీని శనివారం గ్రామ సర్పంచ్ కొక్కుల నరేష్ ఆధ్వర్యంలో కమిటీని ఎన్నుకున్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని కమిటీని ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులుగా ఐలేని వేణుగోపాలరావు, ప్రధాన కార్యనిర్వహణాధికారిగా జలగం వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షులుగా దొకే రాజయ్యలను ఎన్నుకున్నారు.