MNCL: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో CMRF వరంలా నిలుస్తోందని మాజీ DCC అధ్యక్షురాలు సురేఖ అన్నారు. మంచిర్యాల 16వ డివిజన్ చెందిన మౌనిక చికిత్స నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.50 లక్షల పత్రాన్ని శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని పేర్కొన్నారు.