RR: హైడ్రా కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 42 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం పరిసరాల్లోని నేషనల్ హైవే-65లో ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోతుందని, ఈ సమస్యను పరిష్కరించాలని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.