AP: జగన్ రాష్ట్ర రాజకీయాల గురించి కాకుండా CM చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు. ‘చంద్రబాబు మైండ్ సెట్ బాగోలేదని జగన్ అంటున్నారు. కానీ CBN ముఖమే తెలుగు జాతి తలెత్తుకునేలా చేసింది. మా నాయకులను బాడీ షేమింగ్ చేస్తే ఒకే మాటలో చంపేయగలం’ అని హెచ్చరించారు. పాస్ పుస్తకాలపై ఫొటో వేసుకున్న మైండ్ సెట్ ఎవరిదని ప్రశ్నించారు.