ADB: నార్నూర్ మండల కేంద్రంలోని విజయనగర్ కాలనీలో ఉన్న గల మహాలక్ష్మి ఆలయం వద్ద ఇవాళ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని భోగ్ బండార్ సమర్పించారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, మాజీ ఉప సర్పంచ్ మహేందర్, ఫకీర, ఆడే దిగంబర్, అనిల్ నాయక్ తదితరులున్నారు.