KMM: కామేపల్లి మండలంలోని పండితాపురం శ్రీకృష్ణ ప్రసాద్ పశువుల సంత వేలం పాట శుక్రవారం మళ్లీ వాయిదా పడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణయించిన కనీస మద్దతు ధర రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ దారావత్ అనురాధ తెలిపారు. ఆశించిన స్థాయిలో ధర రాకపోవడంతో వేలం ప్రక్రియ వాయిదా పడుతోందన్నారు. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.