GDWL: ఎన్నికల హామీలు అమలు, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనే నినాదంతో బీఆర్ఎస్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో గద్వాల నుంచి బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, విద్యార్థి సంఘం నాయకులు మంగళవారం హైదరాబాద్ వెళ్లారు. అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేసి అసిఫ్ నగర్ స్టేషన్కు తరలించారు.