AP: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేనకు న్యాయం జరగడం లేదన్నారు. ‘జనసేన అసంతృప్తిగా ఉన్న అంశాలను పవన్ దృష్టికి తీసుకెళ్లాం. జనసేన MLAలు ఉన్న నియోజకవర్గాల్లో TDPకి ప్రాధాన్యం ఇస్తున్నాం. మాకు కూడా అదే గౌరవం దక్కాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు, లోకేష్ సహకరిస్తున్నా కిందిస్థాయిలో ఇంకా జరగడం లేదు’ అని వెల్లడించారు.