MBNR: హన్వాడ, ఇబ్రహీంబాద్లో జిల్లా ఉద్యాన అధికారి వేణుగోపాల్ రైతులతో సమావేశమయ్యారు. ఆయిల్ పామ్, ఉల్లి సాగు, తేనెటీగల పెంపకం, MIDH పథకాలపై అవగాహన కల్పించారు. డ్రిప్, మల్చింగ్ పద్ధతులతో అధిక దిగుబడి, లాభాలు సాధించవచ్చని వివరించారు. ఆయిల్ పామ్ సాగు లాభదాయకమని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.